ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మ‌హ‌త్య‌… మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు

6-numbers-family-commit-suicide-due-to-debt-relief-in-suryapet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అప్పుల బాధ తాళ‌లేక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సామూహికంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాధ ఘ‌ట‌న సూర్యాపేట ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. సూర్యాపేట‌లోని క‌స్తూరి బ‌జార్ రెడ్డి హాస్ట‌ల్ స‌మీపంలో నివాసం ఉంటున్న క‌స్తూరి జనార్ద‌న్ పెద్ద కుమారుడు సురేశ్..షేర్ మార్కెట్ లో భారీగా పెట్టుబ‌డులు పెట్టి న‌ష్ట‌పోయాడు. దీంతో అప్పుల భారం పెరిగడంతో మూడురోజుల నుంచి అత‌ను క‌నిపించ‌కుండా పోయాడు. ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో..క‌ష్టాలు తీరే మార్గం లేక సురేశ్ కుటుంబంలోని మిగిలిన స‌భ్యులంతా. ఆదివారం అర్ధ‌రాత్రి…పురుగులు మందుతాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మృతుల‌ను సురేశ్ తండ్రి జ‌నార్ధ‌న్, త‌ల్లి చంద్ర‌క‌ళ‌, భార్య ప్ర‌భావ‌తి, కుమార్తెలు ఐదేళ్ల శాన్విక‌, మూడేళ్ల రుత్వికతోపాటు, సురేశ్ సోద‌రుడు అశోక్ గా  గుర్తించారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు సైతం ఉండ‌టం..చూసేవారికి హృద్ర‌యం ద్రవింప‌చేస్తోంది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి  చేరుకుని మృత‌దేహాల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఒకేసారి ఆరుగురు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డంతో సూర్యాపేట వాసులు సురేశ్ ఇంటి వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.