హైదరాబాద్ లో పెళ్లైన అమ్మాయి అనునాస్పద మృతి

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ పెళ్లైన అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. చాంద్రాయణగుట్టకు చెందిన షోయెబ్‌కు, జేబా ఫాతిమాకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మూడేళ్ల కిందట షోయెబ్‌ గల్ఫ్‌కు వెళ్లగా.. భార్య జేబా ఫాతిమా(37) నగరంలోనే ఉంటోంది. తన తల్లి, సోదరుడితో పాటు ఈ నెల 10న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 1లోని ఓ హోటల్‌లో బస చేసింది.

అయితే ఆమె అదే సమయంలో మౌత్‌ ఫ్రెష్‌నర్‌ ద్రవాన్ని తాగి తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఫాతిమాను కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఆమె మృతి చెందింది. అయితే.. షోయెబ్‌ విదేశాల నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో బంధువైన సయ్యద్‌ రజాహుస్సేన్‌ రజ్వీకి తాజాగా ఫోన్‌చేసి అపోలో ఆస్పత్రికి వెళ్లాలని కోరాడు. ఆస్పత్రిలో మృతదేహాన్ని చూసిన రజ్వీ ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట నిమిత్తం పోలీసులు గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అయితే అసలు ఫాతిమా మౌత్ ఫ్రెషనర్ తాగాల్సిన అవసరం ఏం వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.