నల్గొండలో ఆటోడ్రైవర్ దారుణ హత్య

తెలంగాణలోని నల్లగొండలో ఆటోడ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా కత్తులతో పొడిచి అతడిని చంపేశారు. అద్దంకి – నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే ప్రాథమికంగా మృతుడిని పానగల్ నివాసి అయిన మారం వెంకట్ రెడ్డిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

అయితే వివరాల్లోకి వెళ్తే… ఓ హత్య కేసులో వెంకట్‌రెడ్డి నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య బెయిల్‌పై బయటకు వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. కాగా పాతకక్షల కారణంగా హత్య జరిగిందా? లేకా మరేవైనా ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకట్ రెడ్డిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి శవాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు.