జనం కోసమే ధనమన్న మహానుభావుడు..?

R Narayana Murthy
R Narayana Murthy

పీపుల్స్ స్టార్ గుర్తింపు పొందిన ఆర్ నారాయణ మూర్తి గారి గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పవలసిన అవసరం లేదు. సినిమా రంగంలో తనది ప్రత్యేకమైన ప్రయాణం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అణచివేతలను గమనించి తన సినిమాల్లో పేదల, రైతుల, కార్మికుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించేవారు.తన సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. చీమల దండు,ఎర్రసైన్యం వంటి విప్లవ చిత్రాలతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. సినీ రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. తను చేసిన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచి వారి గుండెల్లో దేవుడయ్యాడు. అనేక సామాజికి కార్యక్రమాలు చేపట్టారు.

సినీ పరిశ్రమలో ఉన్నవాళ్లు ఒక్క సినిమా విజయంతోనే ఖరీదైన ఇళ్లు , ఖరీదైన కార్లు కొనుక్కుని లగ్జరీగా జీవితం ఎంజాయ్ చేస్తున్నారు .. ముర్తి గారు మాత్రం ఎన్ని విజయాలు సాధించిన ఇప్పటి వరకు సొంత కారు , ఇళ్లు లేదు. సాధారణమైన బట్టలు ధరించి, ఆటోల్లోనే ప్రయాణిస్తారు. నిరాడంభరమైన జీవితాన్ని గడుపుతారు. తను ప్రజా జీవితానికి ఎక్కడ దూరమవుతానోనని భావించి వివాహానికి దూరంగా ఉన్న గొప్ప వ్యక్తి .చిన్నయ్య నాయుడు, రెడ్డి చిట్టెమ్మలకు మూడో సంతానంగా పీపుల్స్ స్టార్ నారాయణ జన్మించారు . ఈయన తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబం.సినిమాల్లో నటిస్తూనే బిఏ పూర్తి చేశారు.

సొంతంగా స్నేహ చిత్ర బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించారు. అయితే గతంలో సుమన్ టీవీ ఆర్ నారాయణ మూర్తి హోమ్ టూర్ నిర్వహించగా ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. NTR , ANR ల స్ఫూర్తితో సినిమాలకు ఆకర్షితం అయ్యాడని తెలిపింది. సినిమాలే లోకంగా ప్రజలే ప్రాణంగా తన జీవితాన్ని మలుచుకున్నాడని తల్లి తెలిపింది. తనకు పంచిఇచ్చిన 12 ఎకరాల భూమిని కూడా పంచిపెట్టాడని తెలిపింది. సొంత ఇళ్లు కట్టుకోవాలని, పెళ్లి చేసుకోవాలని , డబ్బులు కూడ బెట్టుకోమని తన కొడుక్కి ఎన్నో సార్లు చెప్పానని, అయిన ఆయన వినకుండా ప్రజా జీవితమే ముఖ్యమని తెలిపినట్లు రెడ్డి చిట్టెమ్మ తెలిపింది. తన కడుపున పుట్టినందుకు ఆమె గర్వంతో ఉప్పొంగిపోయింది.