జొహాన్నెస్ బెర్గ్ లో ఘోర అగ్నిప్రమాదం…52 మంది సజీవ దహనం !

South Africa
South Africa

ఈ రోజు ఉదయం సౌత్ ఆఫ్రికా దేశ ప్రజలకు ఒక పీడకల అని చెప్పాలి.ఈ దేశంలోని జొహాన్నెస్ బెర్గ్ లో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. ఈ నగరంలోని అయిదు అంతస్థుల భవనం లో మంటలు స్టార్ట్ అయ్యాయని సమాచారం ప్రకారం తెలియగానే.. ఏమి జరిగింది అని తెలుసుకునే లోపు భవనం అంతటా క్షణాల్లో మంటలు వ్యాప్తి చెందడంతో మనుషులు ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 52 మంది సజీవ దహనం అయిపోయారని సమాచారం. ఇంకా 43 మందికి గాయాలు అయినట్లుగా అధికారులు తెలియచేశారు.

ఈ కారణంగా జొహాన్నెస్ బెర్గ్ బంగారం అంతటా విషాధచాయలు అలుముకున్నాయి. అయితే మొదటగా ఈ బిల్డింగ్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం జరిగిందని మానేజిమెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.హుటాహుటీన రంగంలోకి దిగిన ఫైర్ సర్వీస్ మరియు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.