ఐశ్వర్యారాయ్ కూతురు ప్రధానమంత్రి అవ్వుద్దట !

Aishwarya's daughter can be PM Says Astrologer gyaneshwar

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌రాలు, మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ కూతురు ఆరాధ్య‌కు రాజ‌కీయాల్లో మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ంట. పెద్దయ్యాక రాజకీయాల్లోకి వస్తే ఆమె ప్రధాన మంత్రి అవుతుందట వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఈ మాటలు చెప్పింది హైదరాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వ‌ర్. భార‌త రాజకీయాల్లో ఐశ్వ‌ర్య కుమార్తె ఆరాధ్య‌కు మంచి భవిష్య‌త్తు ఉంద‌ని, ఆమె ఈ దేశానికి ప్ర‌ధాని కాద‌లుచుకుంటే ఆమె త‌న పేరును రోహిణీగా మార్చుకోవాల‌ని శ్రీమాన్ జోతిష్యులవారు సెలవిచ్చారు.

ఇంతకు ముందు చిరంజీవి, ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని చెప్పింది కూడా ఈయనేనట. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంద‌ని తాను అంత‌కుముందే క‌చ్చితంగా చెప్పాన‌ని జోతిష్యులవారు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. కేంద్రంలో మోదీయే అధికారంలో ఉంటే 2024లో భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని కూడా జ్ఞానేశ్వ‌ర్ స్వామి జ్యోసం చెప్పారు. అయితే స్వామీజీ మాటలు విన్నవాళ్లు ఇవన్నీ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి స్వామీజీలు పాపులారిటీ కోసం నోటికి వచ్చింది చెబుతుంటారని, వాళ్లు చెప్పేవి ఏవీ జరగవని పేర్కొంటున్నారు. అయినా పట్టుమని పదేళ్ళు కూడా లేని పిల్ల రాజకీయాల్లోకి వెళ్తే ప్రదానిమంత్రి అయ్యే అవకాశాలు ఉండటం ఏమిటి ?