మీ టూపై ఐష్‌ కామెంట్స్‌… తెరపైకి సల్మాన్‌ వేధింపులు…!

Aishwarya Rai Bachchan On Me Too Movement

బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానాపటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు తీవ్ర ధుమారాన్ని రేపుతున్నాయి. బాలీవుడ్‌ నుండి మొదలైన మీ టూ ఇప్పుడు ఇండియా అంతటా వ్యాపించింది. పలువురు సినీ తారలు తమపై జరిగిన లైంగిక దాడులను నిర్భయంగా బయటపెట్టేస్తున్నారు. మీ టూ కు పలువురు సినీ ప్రముఖులు మద్దతిస్తున్నారు. ఐశ్వర్యరాయ్‌ కూడా మీ టూకు మద్దతు తెలిపింది. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖులు గతంలో జరిగినవి ఇప్పుడు తెరపైకి ఎందుకు అంటూ బాదితులను చులకన పరిచే విధంగా మాట్లాడుతున్నారు. దీనిపై స్పందించిన ఐష్‌ మహిళలు ఇలాంటివి చెప్పడానికి నిర్ణిత సమయం అంటూ ఏం ఉండదు, తమకు జరిగిన అన్యాయాన్ని ఎప్పుడైనా బయటపెట్టొచ్చు అని మీ టూను సపోర్ట్‌ చేసింది.

aisharya-rai

మీ టూ ఇండియాకు ఇంత స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని, ప్రపంచంలోని ఏ మూలన ఉన్న మహిళ అయిన తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్‌ మీడియా ద్వారా నిర్భయంగా వ్యక్త పర్చవచ్చు అని ఐష్‌ చెప్పుకొచ్చింది. గతంలో తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాటన్నిటిని నేను కూడా బయట పెడతాను అంటూ ఐష్‌ కొత్త వివాదానికి తెరలేపింది. గతంలో ఐష్‌, సల్మాన్‌ ఖాన్‌లు ప్రేమించుకుని ఆ తర్వాత బ్రేకప్‌ చెప్పుకున్నారు. సల్మాన్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని, బయటకు కనిపించని గాయాలను ఎన్నో చేశాడని అప్పట్లో ఐష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఐష్‌ తన అనుభవాలు అంటూ పేర్కోనడం వల్ల మీడియా దానిని మరింత పెద్దదిగా చేసి సల్మాన్‌, ఐష్‌ల కథను మళ్లీ తెరపైకి తెచ్చారు.

Aishwarya-Rai