ఏవేవో క‌ల‌లు క‌న్నా…ఏ వైపో క‌దులుతున్నా…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

akhil HELLO movie live song performance at SIIMA awards
ఈ మ‌ధ్య హీరోలు ఒక్క న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా.. సినిమాలో త‌మ‌కు ఆస‌క్తి ఉన్న రంగాల్లోనూ ఇన్ వాల్వ్ అవుతున్నారు. ఎక్కువ మంది హీరోలు సినిమాలో సొంత గొంతుతో ఓ పాట పాడేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మ‌రికొంద‌రు అవార్డుల ఫంక్ష‌న్స్ లో గొంతు స‌రిచేసుకుంటున్నారు.  వారి బాట‌లో యువ హీరో అఖిల్ కూడా ఒక అవార్డు ఫంక్ష‌న్ లో పాడిన పాట యూ ట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
2017 సైమా అవార్డుల వేడుక‌లో అఖిల్ ఈ పాట పాడారు. త‌న రెండోచిత్రం హాలోలోని పాట‌ను అఖిల్ పాడిన తీరు చూసి అవార్డ్స్ ఫంక్ష‌న్ కు హాజ‌ర‌యిన సినీ ప్ర‌ముఖులు ఆశ్చ‌ర్య‌పోయారు. క్రికెట్‌, న‌ట‌న‌తో పాటు అఖిల్ కు గాయ‌కుడిగానూ ప్ర‌తిభ ఉంద‌ని పలువురు ట్విట్ట‌ర్ లో ప్ర‌శంసించారు కూడా. అయితే అవార్డుల కార్య‌క్ర‌మం ఇంకా ఏ చాన‌ల్ లోనూ ప్ర‌సారం కాక‌పోవ‌టంతో అఖిల్ ఎలా పాడారో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌యిన వారికి త‌ప్ప మ‌రెవ‌రికీ తెలియ‌దు. సైమా స్టేజ్ పై అఖిల్ పాట పాడుతున్న స్టిల్స్ మాత్ర‌మే అప్పుడు బ‌య‌ట‌కువ‌చ్చాయి.  
తాజాగా అఖిల్ పాట వీడియోను అధికారికంగా విడుద‌ల‌చేశారు. ఏవేవో క‌ల‌లు క‌న్నా…ఏవైపో క‌దులుతున్నా…అని సాగే ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో 35వ‌స్థానంలో ఉంది. యూట్యూబ్ లో సామాన్య ప్రేక్ష‌కులతో పాటు సెల‌బ్రిటీలు ఈ పాట‌ను తెగ చూసేస్తున్నారు.  ప‌నిలోప‌నిగా అఖిల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అఖిల్ తండ్రి నాగార్జున‌, రానా, అర‌వింద్ స్వామి, హ‌లో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌, సుమంత్‌, సాయేషా సైగ‌ల్ వంటి ప్ర‌ముఖులు అఖిల్ స్వ‌రం చాలా బాగుంద‌ని, చ‌క్క‌గా పాడార‌ని  ట్విట్ట‌ర్ లో ప్ర‌శంసించారు. అర‌వింద్ స్వామి అయితే చంపేసావ్…అఖిల్ అని ట్వీట్ చేశారు. త‌న‌కు ద‌క్కుతున్న ప్ర‌శంస‌ల‌పై అఖిల్ సంతోషం వ్య‌క్తంచేశారు. లైవ్ లో ప్రేక్ష‌కుల ముందు తాను పాడిన తొలి పాట ఇద‌ని,  ఈ పాట త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని అఖిల్ అన్నారు. అనూప్ రూబెన్స్ వ‌ల్లే ఇది సాధ్య‌మ‌యింద‌ని కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.