‘సైరా నరసింహారెడ్డి’లో కంచె…!

Pragya Jaiswal In Chiranjeevi Sye Raa Narasimha Reddy Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులను మరియు నటీ నటులను పరిచయం చేసిన విషయం తెల్సిందే. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో హీరోయిన్‌గా నయనతారను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే అనధికారికంగా ప్రగ్యా జైస్వాల్‌ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మొదటి నుండి కూడా సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కథకు తగ్గట్లుగా ఒక హీరోయిన్‌ ప్రధానంగా ఉండగా, ఇద్దరు హీరోయిన్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నారు.

ఒక హీరోయిన్‌గా ఇప్పటికే నయనతార ఎంపిక అయ్యింది. మెయిన్‌ హీరోయిన్‌ నయన్‌ను ఎంపిక చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు మరో హీరోయిన్‌ పాత్రకు తాజాగా ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రగ్యా ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుందని, తన వారి కోసం స్వాతంత్య్ర పోరాటంలో దిగి ప్రాణాలు అర్పించే యువతి పాత్రలో ప్రగ్యా నటించనున్నట్లుగా సమాచారం. భారీ అంచనాల నడుమ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో సురేందర్‌ రెడ్డి నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే వేసవిలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఒకేసారి హిందీ మరియు తమిళంలో కూడా విడుదల చేయబోతున్నారు.

మరిన్ని వార్తలు:

ఆగ‌ని ఉత్త‌ర‌కొరియా క‌వ్వింపు చర్య‌లు

అప్పుడు ఇందిర…ఇప్పుడు నిర్మ‌ల