ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి?

allu aravind comments on naa peru surya naa illu india negative Publishers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్‌ తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు తెర లేపుతున్నాయి. ‘నా పేరు సూర్య’ చిత్రంపై బ్యాడ్‌ టాక్‌ను కొందరు కావాలని మొదలు పెట్టారు. సినిమాను కిల్‌ చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు అల్లు అర్జున్‌కు కూడా చెప్పలేదు. త్వరలోనే ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని చెప్తాను అంటూ అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు.

అల్లు అరవింద్‌ చేసిన ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం ఏంటీ, ఇంతకు అల్లు అరవింద్‌ ఎవరిని టార్గెట్‌ చేసి ఆ వ్యాఖ్యలు చేశాడు అంటూ చర్చ జోరుగా సాగుతుంది. ఇటీవల కొన్ని మీడియా ఛానెల్స్‌పై మెగా ఫ్యామిలీ యుద్దం ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ కారణంగానే సదరు ఛానెల్స్‌ ఈ చిత్రాన్ని బ్యాడ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు అని, అందుకే అల్లు అరవింద్‌ వారిపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టి ఉండవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ విషయాన్ని గురించి ఒక క్లారిటీ ఇస్తాను అంటూ అల్లు అరవింద్‌ చెప్పిన నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీవీ9తో పాటు మరికొన్ని న్యూస్‌ ఛానెల్స్‌కు నా పేరు సూర్య యాడ్స్‌ ఇవ్వకూడదని నిర్మాత నిర్ణయించుకున్నాడు. దాంతో ఎదురు దాడికి సదరు ఛానెల్స్‌ దిగే అవకాశం ఉందని మొదటి నుండి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అదే నిజం అయితే నా పేరు సూర్య చిత్రానికి పెద్ద నష్టం తప్పదు. మరి ఆ నష్టాన్ని నిర్మాతలు ఎలా భరిస్తారో చూడాలి.