బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌న ప్ర‌భావం చూపిస్తున్న ‘అల వైకుంఠ‌పుర‌ములో’

బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌న ప్ర‌భావం చూపిస్తున్న 'అల వైకుంఠ‌పుర‌ములో'

బాక్సాఫీసు ద‌గ్గ‌ర అల వైకుంఠ‌పుర‌ములో త‌న ప్ర‌భావం చూపిస్తూనే ఉంది. స‌రిలేరు నీకెవ్వ‌రుతో పోలిస్తే… బ‌న్నీ సినిమాకే టికెట్లు ఎక్కువ తెగుతున్నాయి. చిత్ర‌బృందం కూడా ప్ర‌మోష‌న్ల‌ని ఎక్క‌డా ఆప‌డం లేదు. వీలైన‌ప్పుడ‌ల్లా ఏదో ఓ ఈవెంట్ చేస్తూనే ఉంది. ఇప్ప‌టికే రెండు మూడు స‌క్సెస్ మీట్లు నిర్వ‌హించారు. ఇప్పుడు మ‌రో ఈవెంట్ చేయ‌బోతున్నారు. శ‌ని లేదా ఆదివారాల‌లో అల వైకుంఠ‌పుర‌ములో ఓ ఈవెంట్ ఉండ‌బోతోంది. ఈసారి పంపిణీదారుల్ని పిలిచి వాళ్లని స‌న్మానించాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకుంది. అల వైకుంఠ‌పుర‌ములోకి సంబంధించి ఇదే ఆఖ‌రి ఈవెంట్ కూడా. మ‌రోవైపు రెండో ద‌ఫా మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. బ‌న్నీ – త్రివిక్ర‌మ్‌ల జోడీ ఈరోజు ప్ర‌ధాన దిన ప‌త్రిక‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది. దీంతో ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని అటు బ‌న్నీ, ఇటు త్రివిక్ర‌మ్ భావిస్తున్నారు.