మర్డర్ చిత్రం పై అమృత ప్రణయ్ ఆరోపణలు

మర్డర్ చిత్రం పై అమృత ప్రణయ్ ఆరోపణలు

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్డర్ చిత్రం పై అమృత ప్రణయ్ పలు ఆరోపణలు చేసింది. వాస్తవాలకి దూరంగా మర్డర్ చిత్రం ట్రైలర్, మరియు తాజాగా విడుదల అయిన పాట ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారం పై అమృత కోర్టు ను ఆశ్రయించడం జరిగింది. ఈ సినిమా విడుదల నిలిపివేయాలని అమృత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానం ఎస్సి, ఎస్టీ కోర్టు కి చేరగా, అక్కడి నుండే దర్శక నిర్మాతలకి నోటీసులు జారీ చేయడం జరిగింది.

అయితే ఈ మెయిల్ మరియు వాట్స్ ఆప్ ల ద్వారా నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే అమృత ప్రణయ్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ల ఆధారం గా సినిమా తెరకెక్కించడం, అందుకు సంబంధంచిన ట్రైలర్, పాట లు వాస్తవాలకు దూరం గా ఉన్నాయి అంటూ అమృత ఆరోపించడం తో మళ్లీ ఈ చిత్రం పై ప్రజలు చర్చలు జరుపుతన్నారు. అయితే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఇటువంటి వాటికి బెదరకుండా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు. గతం లో సైతం ఇలాంటివి చాలానే ఎదుర్కొన్నారు వర్మ.