మాట్లాడకుండా ఉండబోతున్న అనుష్క

మాట్లాడకుండా ఉండబోతున్న అనుష్క

అనుష్క శెట్టి ఈ పేరు వినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అందంతో, అభినయంతో, చక్కని నటనతో అండతిని ఆకట్టుకున్న నటి అనుష్క శెట్టి. మొట్టమొదట తెలుగు లో పూరీజగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది.కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి.

ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనె తనలోని నటిని ఆవిష్కరింఛింది.తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటించి శభాష్ అనిపించింకుంది.. ప్రభాస్ కి సరిపడా జోడి అనుష్క. వీల్లద్దరి కాంబినేషన్ లో వచ్చింది సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా టాలీవుడ్‌లో బిగ్ ఫోర్‌గా చెప్పుకునే వెంకటేష్‌, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జునలతో ఎన్నో మూవీల్లో ఆడిపాడింది. వీరిలో చిరుతో మాత్రం పూర్తి సినిమాలో నటించకపోయినా స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేస్తోంది. సరికొత్త లైన్‌తో వస్తున్న ఈ మూవీని కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అనుష్క ఫస్టాప్ మొత్తం మాట్లాడకుండా ఉంటుందట. 2005లో వచ్చిన ‘నరసింహుడు’ సినిమాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ వరకు మాట్లాడడు. ఇప్పుడు అనుష్క అతడిని ఫాలో అవుతుందట. ఈ అంశం నచ్చే ప్రభాస్ చిత్ర ప్రమోషన్‌కు సాయం చేస్తానని ఒప్పుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.