AP Politics: ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా?: నారా లోకేశ్

AP Politics: Did you ask the Center anything about special status?: Nara Lokesh
AP Politics: Did you ask the Center anything about special status?: Nara Lokesh

ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైకాపా.. ఆ దిశగా కృషి చేసిందా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. మన్యం జిల్లాలో జరిగిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడారు. వైకాపాకు 22 మంది లోక్సభ, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ.. ప్రత్యేక హోదాపై ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా? అని నిలదీశారు. వైకాపా నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని.. అసలు ఆ పార్టీలోనే సామాజిక అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఎన్నికల వేళ సీఎం జగన్ ఇప్ప టివరకు 63 మంది ఎమ్మెల్యే లు, 16 మంది ఎంపీలను బదిలీ చేశారన్నారు. వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ నాయకులే ఉన్నారని లోకేశ్ ఆరోపించారు.