ఎల్బీనగర్ లో దారుణం.. అక్కా, తమ్ముడిపై దాడి.. తమ్ముడు మృతి

Atrocity in LBnagar.. Sister and younger brother attacked.. Younger brother died
Atrocity in LBnagar.. Sister and younger brother attacked.. Younger brother died

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు ఇంట్లో అక్కా, తమ్ముడు ఇద్దరే ఉన్నారని గమనించి ఓ దుండగుడు వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో తొలుత చింటు (20) అని విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుగా వెళ్లిన అక్క సంఘవి పై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో చింటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

అక్క సంఘవి ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సంఘవి హోమియోపతి చదువుతుంది. గత కొంతకాలంలో సంఘవి ఎల్బీనగర్ లో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో వీరిద్దరూ ఉన్న సమయంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు దుండగుడిని నిర్భందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దుండగుడు వీరిపై ఎందుకు దాడి చేశాడనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.