పలాసలో మరో ప్రణయ్…కానీ !

Attack On Lovers At Palasa

తనకు ఇష్టం లేకుండా తన కూతురిని తీసుకువెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో తన కూతురు పెళ్లి చేసుకున్న యువకుడిని మిర్యాలగూడ రియల్టర్ ఒకరు హత్య చేయించిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే నిన్న హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ రెండు ఘటనలు మరువక ముందే ఇప్పుడు తాజాగా అలాంటి దాడి జరిగింది. అందుతున్న సమాచరం మేరకు శ్రీకాకుళం జిల్లా పలాస పెద్ద ఉదయపురానికి చెందిన పొందూరు మురళీ, అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరికీ వయసు అంతరాలు ఉండడం వేర్వేరు కులాలు కావడంతో వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో ఇంటినుంచి పారిపోయారు. అప్పటికి ఆమెకు మైనారిటీ  తీరకపోవడంతో బాలిక కుటుంబీకులు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతకగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉన్నట్లు కనుగొని వారిని ఇక్కడికి తీసుకొచ్చి బాలికను ఆమె కుటుంబీకులకు అప్పగించి, మురళీని అత్యాచారం, కిడ్నాప్‌ కేసు కింద అరెస్టు చేశారు.

Lovers Commit Suicide
బెయిల్‌పై విడుదలైన మురళీ అప్పటినుంచి పలాసలోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ బాలికకు 18 యేళ్లు నిండాయి. దీంతో ఆమె కుటుంబీకులు కాస్త భయాందోళనలో ఉన్నారు. బుధవారం రాత్రి పెద్ద ఉదయపురం ప్రాంతంలో గణేష్‌ నిమజ్జనం జరుగుతుండగా, బాలిక సోదరుడితో పాటు మరికొందరు తనపై కత్తితో దాడి చేశారని, అడ్డుకోబోయిన గంగారాం అనే వ్యక్తి పైనా దాడి చేశారని మురళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురళీ, గంగారాంలు పలాస ప్రభుత్వాసుపత్రిలో చేరగా, కొద్దిసేపటికే బాలిక సోదరుడు సైతం ఆసుపత్రిలో చేరాడు. మురళీయే తనపై దాడి చేశాడని అతను ఫిర్యాదు చేశాడు. కాగా దాడి జరిగిన తర్వాత బాలిక, మురళీ వద్దకు చేరుకొంది. ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకొన్న నేపథ్యంలో బాలిక సోదరుడిపై కేసు నమోదు చేసి అతనినుంచి వివరాలు సేకరించినట్లు కాశీబుగ్గ సీఐ పేర్కొన్నారు.