మహిళని కిడ్నాప్ చేయాలని భావించిన ఆటో డ్రైవర్

మహిళని కిడ్నాప్ చేయాలని భావించిన ఆటో డ్రైవర్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ చట్టం ఇంకా అమలు కానప్పటికీ , దిశ యాప్ ద్వారా చాల మందికి సకాలంలో సహాయం అందుతుంది. అయితే తాజగా కొల్లేటి కోట లో ఒక మహిళ ని ట్రాప్ చేయబోయాడు ఆటో డ్రైవర్. అయితే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి కిడ్నాప్ చేయాలనీ భావించినట్లు తెలుస్తుంది. అయితే అనుమానం వచ్చిన మహిళ దిశ యాప్ సహాయంతో తప్పించుకుంది.

ఆటో డ్రైవర్ తీరు ని గమనించిన సదరు మహిళ, అప్రమత్తమై sos ద్వారా సమాచారం అందజేశారు. అయితే ఘటన స్థలానికి ఎనిమిది నిమిషాల్లో పోలీసులు చేరుకొని మహిళని కాపాడి, ఆ ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ పెద్ది రాజును అరెస్ట్ చేసి కిడ్నాప్ యత్నానికి గల కారణాల్ని అడిగి తెలుసుకుంటున్నారు.