బాహుబలిని భయపెట్టిన కరోనా

బాహుబలిని భయపెట్టిన కరోనా

చైనాలో ప్రాణంపోసుకొని ప్రపంచమంతా పాకుతుంది కరోనా వైరస్. ఇప్పటికే వేల మంది ప్రాణాలను హరించిన ఈ వైరస్ ఇప్పుడు తెలంగాణలోకి కూడా అడుగుపెట్టింది. దాంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా సోకినా వ్యక్తి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా ఎంటర్ అయ్యిందని తెలుసుకున్న ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం మాస్క్ లేకుండా బయటకు రావడంలేదు. టాలీవుడ్ లోనూ కరోనా ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. తాజా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మాస్క్ ధరించి కనిపించాడు.ఆయన తన ముక్కుకు ఎయిర్ ఫిల్టర్ మాస్క్ ధరించి ఎయిర్ పోర్టు లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం జాన్ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్తూ ఇలా మాస్క్ తో దర్శనమిచ్చాడు మన బాహుబలి.