పార్లమెంట్ లో కుప్పకూలిన అనకాపల్లి ఎంపీ, గుండె నొప్పి లక్షణాలు !

Avanthi Srinivas Gets Heart Attack in Parliament

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈరోజు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ కుప్పకూలిపోయారు. గత కొద్ది రోజులగా ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కూడా రాజ్యసభలో టీడీపీ ఎంపీలు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో టీడీపీ లోక్‌సభ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సెంట్రల్ హాల్‌లో ఆందోళన చేస్తుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనకి మైకం కమ్మినట్టు పడిపోయారు. అయితే ఆయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పి లక్షణాలు కూడా కనపడటంతో ఆయనకి ఏమైందో నన్న ఆందోళనలో మిగతా తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. ఆయనని ఆసుపత్రికి తరలించే ముందు వైద్యులు వచ్చి ఆయన్ను పరీక్షించారు. బీపీ కారణంగానే శ్రీనివాస్ సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.