తాగి పోలీసులకు జర్క్ ఇచ్చి ఉడాయించిన బెంగుళూరు యువతులు

కరోనా మహమ్మారితో ప్రపంచ అల్లకల్లోలంగా మారింది. దీంతో దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. కోరనాను కట్టిడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో పీకాలదాక తాగిన యువతులు.. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా పోలీసుల పైనుంచి వాహనాన్ని ఎక్కించి నడిపించే ప్రయత్నం చేశారు. కాగా ఈఘటన తాజాగా బెంగళూరులో చోటుచేసుకుంది.

అయితే లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు నగరంలో అక్కడక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. తాజాగా నలుగురు యువతులు ఫుల్లుగా మద్యం తాగి కారులో ప్రయాణిస్తూ లీలా ప్యాలెస్‌ సమీపంలో చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. ఆ టైంలో పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేస్తుండగా తమ వద్ద పాస్‌ ఉందని.. మాకు ఉన్నతాధికారులు తెలుసు అంటూ యువతులు వాదనకు దిగారు. ఆ తర్వాత మద్యం తాగినట్లు అనుమానం రావడంతో పోలీసులు బ్రీతింగ్‌ అనలైజర్‌తో తనిఖీ చేయడానికి యత్నించారు. దీంతో యువతులు పోలీసులపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేసి పరారయ్యారు. పోలీసులు బైక్‌పై కిలోమీటర్‌ దూరం వరకు వెంటాడినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా యువతులు అత్యంత వేగంగా ప్రయాణించి తప్పించుకున్నారు. కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.