ప్రియురాలి కాళ్లు చేతులు కట్టేసి దారుణం.. ఆపై ట్యాంకులో శవం…

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని దారుణంగా చంపి.. సహజీవనం చేశాడు ఓ దుర్మార్గుడు. బండరాయితో కట్టి పడేసిన ఆమె శవం నీళ్ల ట్యాంకులో తేలియాడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే అసలు ఏం జరిగింది అంటే… ప్రియురాలు తనతో కాదని.. మరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన ప్రియుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను దారుణంగా చంపేసి నీళ్ల ట్యాంకులో పడేసి పరారై పోయాడు. కాగా ప్రియురాలి మృతదేహం నీళ్లలో తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన ఘటన పూణెలో జరిగింది.

అయితే ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యువతి, యువకుడు కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఆ జంట బెంగళూరు నుంచి పూణె సమీపంలోని లొహెగావ్ ప్రాంతానికి వచ్చి కూలి పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. కాగా బ్రిక్స్ తయారీ కంపెనీలో కూలీగా పని చేస్తున్న ప్రియుడు కొద్దికాలంగా ప్రియురాలిపై అనుమానం పెంచుకొని ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

తన ప్రియురాలు మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ప్రియుడు.. ఆ అమ్మాయిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఓ పెద్ద బండరాయి కట్టి లొహెగావ్ ప్రాంతంలోని నీళ్ల ట్యాంకులో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా తాజాగా ఆమె మృతదేహం నీటిపై తేలియాడడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను దారుణంగా చంపేశాడని నిర్ధారణకు వచ్చారు. అతనిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు.