టీటీడీ జేఈవోగా భాద్యతలు చేపట్టిన బసంత్ కుమార్

basanth kumar as ttd jeo

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా బసంత్ కుమార్ భాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని గరుడళ్వార్ సన్నాధిలో టీటీడీ జేఈవోగా ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ…నా మొదటి ప్రాధాన్యత భక్తులు సౌకర్యాలను మెరుగు పరచడంమని, రెండోవ ప్రాధ్యనత అవినితి రహిత పాలన అందించడంమని, మూడోవ ప్రాధ్యనత స్వామి సన్నిధిలో సేవ చెయ్యడం ద్వారా నా జన్మను సార్దకం చేసుకోవడంమని జేఈవో బసంత్ కుమార్ స్పష్టం చేసారు. అవినితి ఆరోపణలు పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.