మాట వినని భర్తకోసం భీమా కట్టి మరీ చంపేసింది..

కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడు.....

తెలంగాణలో ఘోరం చోటుచేసుకుంది. తాగుడుకు బానిసైన భర్తకు భార్య ఎంత చెప్పినా మాట వినడం లేదు. ఎదిగొచ్చిన కూతురుతో అసభ్యంగా ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించి ఎన్నిమార్లు చెప్పినా మాట వినడం లేదు. పలుసార్లు విఫలమైంది కూడా. విసిగిపోయి అతణ్ని హతమార్చడమే సమస్యకు పరిష్కారమని ఆలోచించింది. భర్త చనిపోతే కుటుంబ పోషణకు డబ్బులు కావాలి కదా.. అందుకే ఆరు నెలల క్రితమే అతడి పేరిట బీమా చేయించింది. తర్వాత అక్కాబావతో కలిసి భర్తను హత్య చేసింది.

పక్కాగా వ్యూహం రచించింది భార్య. ఇది వరంగల్ రూరల్ జిల్లా హతియతండాకు చెందిన బాదావత్‌ వీరన్న, యాకమ్మ దంపతులు ఓ కూతురు, కుమారుడు నివాసం ఉంటున్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్లపాటు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత వీరన్న మద్యానికి బానిసగా మారాడు. తాగి వచ్చి భార్యా పిల్లలను వేధించసాగాడు.  భార్య ఎంత చెప్పినా భర్త వినుకోవడం లేదు. దీంతో ఆరు నెలల క్రితం భర్త పేరిట రూ.20 లక్షలకు భార్య ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. అయితే లాక్‌డౌన్ టైంలో ఖాళీగా ఉండటంతో వీరన్న తాగుడుకి మరింతగా బానిసయ్యాడు. డబ్బులు లేకపోతే ఖాళీ మద్యం సీసాలను విక్రయించి తాగొచ్చనే ఉద్దేశంతో నెక్కొండ వెళ్లాడు. శంకర తండాలో ఉండే తన అక్క బుజ్జి, బావ బిచ్యాకు యాకమ్మ ఈ విషయం చెప్పింది. యాకమ్మ సోదరిని హతియాతండాకు తీసుకొచ్చిన బావ.. నెక్కొండ వెళ్లి వీరన్నకు మద్యం తాగించాడు. తర్వాత బైక్ మీద హతియా తండాకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురూ కలిసి వీరన్నను పొలానికి తీసుకెళ్లి తాడుతో ఉరి వేశారు. తర్వాత ముఖంపై బండరాయితో మోది కాల్వలో పడేశారు. హత్య తర్వాత యాకమ్మ అక్కా, బావ సొంతూరు వెళ్లిపోయారు. ఇంటికి తిరిగొచ్చిన యాకమ్మ భర్త కనిపించడం లేదని గ్రామస్థులకు చెప్పింది. అందరూ కలిసి వెతుకుతుండగా.. కాల్వలో వీరన్న డెడ్ బాడీ కనిపించింది. దీంతో తన భర్తను ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా ఆ కేసుతో విచారణను ప్రారంభించిన పోలీసులు ఏం జరిగిందని ఆరా తీశారు. వీరన్న తిరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో యాకమ్మ బావపై అనుమానం రేగింది. దీంతో తమదైన శైలిలో పోలీసులు బావను ప్రశ్నించడంతో తామే వీరన్నను హతమార్చామని ముగ్గురూ ఒప్పేసుకున్నారు. మొత్తానికి మాట వినని భర్తను భీమా చేసి మరీ భార్య హతమార్చడం సంచలనంగా మారింది.