చైనా సైన్యంపై భారత్ సైనికులు పిడిగుద్దులు.. వీడియో వైరల్

చైనా.. భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే  తాజాగా జరిగిన ఘర్షణ ఇరు దేశాల సైనికుల ప్రాణాలను బలితీసుకుంది. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున సిక్కిం సమీపంలోని మంచుకొండల్లో సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికులు గొడవ పడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. లడఖ్ సమీపంలో ఇరు దేశాల మధ్య గొడవలు చెలరేగి.. ఇరుపక్షాల సైనికులూ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇగి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో చైనా మిలటరీ అధికారిపై భారత జవాను పిడిగుద్దులకు దిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఐదు నిమిషాల నిడివితో ఈ వీడియో వైరల్ గా మారింది.

 కాగా ఇరు పక్షాలూ “గో బ్యాక్”, “డోంట్ ఫైట్” అంటున్న నినాదాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. నేలంతా మంచు నిండిపోయి కనిపిస్తుండగా.. చైనా, భారత్ సైనికులు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. కాసేపటి తర్వాత వివాదం ఆగిపోయినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఎప్పటిదన్న విషయంపై స్పష్టత లేదు. ఎవరు షూట్ చేశారన్న విషయం కూడా తెలియడం లేదు. ఆ వీడియోను ఓ లుక్ వేద్దామా.