చైనా-భారత్‌ బోర్డర్ లో ఉద్రిక్తత… నలుగురు జవాన్ల పరిస్థితి విషమం

భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లడఖ్‌లోని సరిహద్దుల వద్ద భారత్‌, చైనా మధ్య చోటు చేసుకున్న గొడవల్లో ఇప్పటికే దాదాపు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

కాగా భారత జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో చైనా సైనికులు దాడికి దిగారు. ఈ ఘటనలో మరికొంత మంది భారత జవాన్లు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అలాగే.. ఈ ఘర్షణలో ఇప్పటికే 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ఆర్మీ నిర్ధారించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి తూర్పు లడఖ్‌ గాల్వన్‌ లోయలో భారత్-చైనా జవాన్లు ఘర్షణ పడిన ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి.