షేక్ పేట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య….

ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయాల విలువైన‌ భూ వివాదం కేసులో చిక్కుకొని.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన షేక్‌పేట్‌ తహశీల్దార్‌ సుజాత భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. గాంధీన‌గ‌ర్‌లో భ‌వ‌నంపైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఎమ్మార్వో సుజాత భ‌ర్త అజ‌య్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

అయితే చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గాంధీన‌గ‌ర్‌లోని తన చెల్లెలు ఇంటి వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి త‌ర‌లించారు. ఈ మధ్య ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయ‌గా.. ప‌లు సెక్ష‌న్ల కింద ఆమెపై కేసులు న‌మోదు చేశారు. కాగా ఇదే కేసులో సుజాత భ‌ర్త అజ‌య్‌ను కూడా ఏసీబీ అధికారులు విచారించారు.  ఓవైపు భార్య సుజాత అరెస్ట్ కావ‌డం, మ‌రోవైపు.. ప‌రువుపోయింద‌ని ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజ‌య్‌కుమార్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి ఈ కేసులు ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి.