కాంగ్రెస్ పరువు తీసిన భూమన

Bhumana Karunakar Reddy Shocking Comments On YSRCP Party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Bhumana Karunakar Reddy Shocking Comments On YSRCP Party

కాంగ్రెస్ పార్టీకి, ఈజిప్ట్ మమ్మీకి తేడా లేదా. కాంగ్రెస్ ను ప్రత్యర్థి బీజేపీ కూడా ఎప్పుడూ ఇంత దారుణంగా తిట్టలేదు. కానీ వైఎస్ సన్నిహితుడు, వైఎస్సార్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం నోరు పారేసుకున్నారు. తమ ఇష్టం వచ్చినవారికి మద్దతిస్తామని, కాంగ్రెస్ కు ఎందుకు మద్దతివ్వాలని ఆయన ప్రశ్నించడం వరకు బాగానే ఉన్నా.. అందుకోసం ఎంచుకున్న పదజాలం మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉంది.

కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ కు మద్దతు ఇవ్వాలని రఘువీరా జగన్ కు లేఖ రాయడంతో.. భూమన రెచ్చిపోయారు. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ లేఖ రాసిందని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ చక్కగా ఉంటే, సోనియా సహకరించి ఉంటే జగన్ ఎప్పుడో సీఎం అయ్యేవారని, ఇప్పుడు వారికి అవసరం కాబట్టి కాళ్లబేరానికి వచ్చారని మండిపడ్డారు.

బద్ధశత్రువువైన బాబు మద్దతుతో ప్రభుత్వం నడిపిన కాంగ్రెస్.. పార్టీకి జవజీవాలిచ్చిన వ్యక్తి కొడుకుని జైలుకు పంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన,కాంగ్రెస్ పార్టీ వందల అడుగుల లోతులో జనం పూడ్చిపెట్టారని, కాంగ్రెస్ కు , ఈజిప్ట్ మమ్మీకి తేడా ఏముందని భూమన ప్రశ్నించడంతో కాంగ్రెస్ షాకైంది.

మరిన్ని వార్తలు:

ఫోటోలో నుంచి అటూఇటూ తిరిగిచూస్తున్న సాయిబాబా. వైరల్ వీడియో