కుక్కలు, పందులా… భూమన భాషకి సిగ్గుపడాలి.

bhumana karunakar reddy used unparliamentary words on TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలు ఎటూ నీతితప్పాయని అందరూ అంటున్నారు. మార్పు మీద నమ్మకంతో ఎవరన్నా ముందుకు వచ్చినా అక్కడి పరిస్థితులు చూసి దడుచుకుంటున్నారు. రాజకీయాల్లో మార్పు తేలేకపోవచ్చు గానీ కనీసం అందులో మనుగడ సాగిస్తున్నందుకు నోటిని అయినా కాస్త అదుపులో పెట్టుకోవాలి. ప్రెస్ ముందుకు వచ్చే వైసీపీ నేతల భాష వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని కొత్తగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ నెత్తినోరు కొట్టుకుంటున్నా ఆ నాయకులు కళ్ళు తెరవడం లేదు. తాజాగా హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి వాడిన భాష చూస్తే మతి పోవాల్సిందే.

ప్లీనరీలో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలతో టీడీపీ నేతల గుండెలు అదురుతున్నాయని భూమన మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుడుతోందని ఆ మాటలు పొడిగించారు. అంతటితో ఆగితే ఎలా ఉండేదో గానీ వైసీపీ ప్లీనరీ మీద విమర్శలు చేసిన టీడీపీ నేతల్ని పట్టుకుని శునకాలు, వరాహాలు అనేసారు భూమన. ఆయన భాష సామాన్యులకి అర్ధం కాకపోయినా కుక్క, పందికి అవి పర్యాయ పదాలని తెలిసిన వాళ్ళు ఆయన భాష చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సిగ్గుతో చచ్చిపోతున్నారు. ఈ మాటలు విన్న అధికారపక్షం నాయకులు ఇంకాస్త రెచ్చిపోతే దానికి బాధ్యులు ఎవరు ? జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ నోటి నేతలే వైసీపీ కి చితిమంటలు పెడతారు.

మరిన్ని వార్తలు 

వారంలో రెండు రోజులు ఏడుస్తున్నాడంట.

హైకోర్టు, అసెంబ్లీ తారుమారు…

తెలుగువాడి అణా దెబ్బ …