రాజమౌళి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

రాజమౌళి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..
Latest News

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని మూవీ లు సూపర్ హిట్ గా నిలిచాయి. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ వరకు అన్ని సంచలన విజయలు అందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఇక ఇప్పుడు రాజమౌళి నిర్మాతగా మారారు. రాజమౌళి ప్రజెంట్ చేస్తున్న ఈ మూవీ కు మెడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. భారతీయ సినిమా రంగం పై సినిమా తెరకెక్కిస్తున్నారు. గత కోదిరోజులుగా రాజమౌళి ఓ పెద్ద అనౌన్స్ మెంట్ వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..
Rajamouli

టాలీవుడ్ లో టాప్ దర్శకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ఎస్ ఎస్ రాజమౌళి గారి పేరు . దర్శక ధీరుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు రాజమౌళి. తాజాగా రాజమౌళి ఒక భారీ మూవీ ను ప్రజెంట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. మెడ్ ఇన్ ఇండియాలో ఇండియన్ మూవీ ఎక్కడ పుట్టింది ఎలా ప్రపంచ కీర్తి గడించింది అన్నది కూడా చూపించనున్నారు. ఈ సినిమాకు నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మెడ్ ఇన్ ఇండియాను ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. రాజమౌళి సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మేరకు ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

అలాగే రాజమౌళి తన ట్విట్టర్ లో ” ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. బయోపిక్ ను తీయడం అంత ఈజీ ఏమి కాదు చాలా కష్టం .. బయోపిక్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ ను ఎదుర్కోవాలి అని అన్నారు . ఇలాంటి మూవీ ను నిర్మిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా, అలాగే చాలా గర్వంగా ఉంది అని తెలిపారు. ఆరు భాషల్లో ఈ మూవీ ను పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కిశోరం కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ కోసం వర్క్ షాప్ ను మొదలు పెట్టనున్నారు.