ఆపిల్‌ కంపెనీలో తీవ్రమైన సమస్య

ఆపిల్‌ కంపెనీలో తీవ్రమైన సమస్య

మనిషిని ఆపరేట్‌ చేసేది మెదడు. మరి ఆ మెదడునే మనిషి ఆపరేట్‌ చేస్తే..ఇదిగో ఇలాంటి ఐడియాతో మనిషి మెదడులో కంప్యూటర్‌ చిప్‌ను అమర్చేందుకు ఎలాన్‌ మస్క్‌ న్యూట్రాలింక్‌ ప్రయోగం తెరపైకి తెచ్చారు. ఆ ప్రయోగం ఎలా ఉన్నా ఇప్పుడు ప్రపంచ దేశాల్ని చిప్‌ల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది.నేడు మనం వినియోగించే అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో సెమీ కండక్లర్లు లేదా చిప్‌లు ఉంటాయి. కానీ కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో చిప్‌ల తయారీ ఆగిపోయింది. చిప్‌ల తయారీ ఆగినా వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌ లైన్‌ క్లాసులతో వాటి వినియోగం పెరిగింది.ఈ ఏడాది మార‍్చి నెల ముందు చిప్‌ల సమస్య తలెత్తినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

దేశంలో భారీ ఎత్తున చిప్‌లు స్టాక్‌ ఉండడంతో సమస్యలు తలెత్తలేదు.ఇప్పుడిప్పుడే వాటి అవసరం తెలిసి వస్తుంది. చిప్‌లు, సెమీ కండర్లు లేకపోవడం వల్ల ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ వ్యాపారం దెబ్బతింటుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ చిప్‌ కొరత కారణంగా మాక్‌,ఐప్యాడ్‌ అమ్మకాలు క్షీణించినట్లు చెప్పారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో ఆదాయం సుమారు 6 లక్షల కోట్లు. మాక్ నుండి వచ్చే ఆదాయం సుమారు రూ .61 వేల కోట్లు, ఐప్యాడ్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు 54 వేల కోట్లు. అయినా సెప్టెంబర్ త్రైమాసికం సమయానికి చిప్‌ లేకపోతే కష్టమేనని అంటున్నారు టిమ్‌ కుక్‌.