హైదరాబాద్ లో కాంగ్రెస్ శిబిరం…అందరూ అక్కడికే…!

From Where The Kcr Is Contesting As MP

ఎన్నికలు జరిగింది ఐదు రాష్ట్రాల్లో అయినా మిగతా నాలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం టెన్షన్ పడటం లేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం టెన్షన్ పడుతోంది. దానికి కారణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ! అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే కేసీఆర్ కు బీజేపీ సహకరిస్తున్న విషయం బట్టబయలు కావడమే. తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదన్నది రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తున్న అభిప్రాయం. తెలంగాణలో టీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ వస్తుదని ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినా అదే పరిస్థితి టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నా హంగ్ వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ గెలవబోయే ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు ముందు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆ పార్టీకి చెందిన ప్రధాన వ్యూహకర్తల్ని హైదరాబాద్ లో ఇప్పటికే మోహరించింది.

congress-trs

ఆ పార్టీ ట్రబుల్ షూటర్ లు గా పేరున్న గులాంనబీ ఆజాద్‌, డీకే శివకుమార్‌, అహ్మద్‌పటేల్‌, జైరాం రమేష్‌తో పాటు మరికొందరు నేతలు హైదరాబాద్ లలో దిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరూ టీఆర్ఎస్ వలలో పడకుండా వీళ్ళు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులందర్నీ కొంత మంది కీలక నేతలకు అటాచ్ చే్సతున్నారు. వారిని వారే కని పెట్టుకుని ఉండనున్నారు. అలాగే ఏ పార్టీకి , కూటమికి మెజార్టీ రాకపోతే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తే ఎలా ప్రతిఘటించాలన్న విషయంపైనా అవసరం అయితే ఉన్న పళంగా కోర్టులో పిటిషన్లు వేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత కర్నాటక, గోవా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏమి జరిగినా వెంటనే స్పందించేలా మరి కొందరు ముఖ్య నేతలను కూడా కాంగ్రెస్ రంగంలోకి దించుతోంది.

mim-chief