చివరకు రానా వద్దకు వచ్చిన ఆ స్టోరీ…!

Rana Hiranyakashipu Movie On Sets In January

రానా బాహుబలి చిత్రం తరువాత రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రామానాయుడు మనవడిగా, సురేష్ బాబు కొడుకుగా సినిమా రంగప్రవేశం చేశాడు.మొదటి సినిమా లీడర్ తో ఎంట్రి ఇచ్చిన ఆ సినిమా అనుకునంతాగా ఆడింది లేదు. కానీ రానా నటనకు, బాడీ లాంగ్వేజ్ కి మాత్రం మంచి మార్క్స్ పడ్డాయి. బాలీవుడ్ నుండి మంచి ఆఫర్స్ రానా కు వచ్చాయి. కథ మంచిగా ఉంటె చాలు సినిమా దానంతట అదే ఆడుతుంది అని నమ్మే వ్యక్తి రానా, అలా బాలీవుడ్ లో మంచి కథలు రావడంతో అక్కడ సినిమాలో నటిస్తూ మంచిపేరును సంపాదించుకున్నాడు.

rana

ఇప్పుడు తాజాగా మరో కథకు ఒకే చేశాడంట.. పూర్తి వివరాలలోకి వెళ్ళితే తెలుగులో ఐతే, ప్రయాణం, మనమంతా వంటి డిఫరెంట్ సినిమాలు తీస్తూ వస్తున్నా చంద్రశేకర్ ఏలేటి, ఓ కథను సిద్దం చేశాడు. ఆ కథను ముందుగా, సాయి ధరం తేజ్, నాని, నితిన్ వంటి హీరోస్ కు వినిపించాడు కానీ వారు ఎవ్వరు ఫైనలైజ్ చెయ్యలేదు. చివరకి ఆ కథను టాలీవుడ్ హల్క్ రానా కు వినిపించడంట రానా ఒకే చెప్పడం, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తానని ముందుకు రావడం జరిగిందంట. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా మైత్రి మూవీ వారు మరో సినిమాను రానా తో చెయ్యడానికి ముందుకు వచ్చారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే నటులు నటిమనుల గురుంచి తెలుస్తాయి అంటున్నారు.