పేలుడు ప్రమాదంలో ఇద్దరు మృతి

పేలుడు ప్రమాదంలో ఇద్దరు మృతి

కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో గురువారం పేలుడు సంభవించింది. జయరాజ్‌ ఫ్లైవుడ్‌ కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడకు చెందిన తండ్రి,కొడుకు స్క్రాబ్‌ కొనుగోలు చేసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రమాదంపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.