ఎందరో అభిమానులని సంపాదించిన జంట

ఎందరో అభిమానులని సంపాదించిన జంట

సిద్ధార్థ్ శుక్లా మరియు షెహనాజ్ జంట ఇప్పడు ప్రపంచమంతా మార్మోగిపోతుంది. హిందీ బిగ్ బాస్ 13 లో ఈ ఇద్దరు చాలా మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారు, వీళ్లిద్దరి కోసమే అందరూ బిగ్ బాస్ చూడటం మొదలుపెట్టారు. అయితే సిద్ధార్థ్ శుక్లా విన్నర్  గా నిలిచారు. #sidnaaz అనే టాగ్ ఇప్పడు ట్రెండ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే అందుకు గల కారణం ఈ ఇద్దరి మద్య ఉన్న స్వచ్చమైన బందం.కొన్ని రోజుల క్రితం షహనాజ్ గురించి  ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ ఇలా అన్నాడు. బిగ్ బాస్ తరువాత కూడా మేమిద్దరం ఒకేలాగా ఉన్నాం ఇద్దరి ఫీలింగ్స్ లో ఏం మార్పు లేదని ప్రస్తావించారు.ఫాన్స్ అందరూ వీళ్లిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడటానికి చాలా ఇష్టపడుతున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఈ ఇద్దరి గురించి మాట్లాడుకోవడం విశేషం. ఎవరికి లేనంత ఆదరణ సిద్ధార్థ్ శుక్లా మరియు షెహనాజ్ కి దక్కడం అభిమానులకి చాలా ఆనందాన్ని ఇస్తుంది.