ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ

ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ

ప‌వ‌న్ క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే క్లాప్ కొట్టారు. కొంత‌మేర షూటింగ్ కూడా జ‌రిపారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ మొద‌ల‌వ్వ‌బోతోంది. ఈనెల 8 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూలుకు శ్రీ‌కారం చుడుతున్నారు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన సెట్లు రూపొందించారు. అక్క‌డే సింహ భాగం షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. 8వ తేదీన సెట్లో ప‌వ‌న్ అడుగుపెట్ట‌నున్నాడ‌ని టాక్‌. ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ ఇది. అప్ప‌టి సాంఘిక‌, ఆర్థిక, రాజ‌కీయ ప‌రిస్థితుల్ని తెర‌పై చూపించ‌బోతున్నారు. కోహినూర్ వ‌జ్రం చుట్టూ క‌థ న‌డ‌వ‌బోతోంద‌ని టాక్‌. ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నార‌ని, అందులో ఓ క‌థానాయిక జాక్విలెన్ ఫెర్నాండేజ్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర‌బృందం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.