BREAKING NEWS: కవితకు మరో షాక్.. ఈనెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

BREAKING NEWS: Another shock for Kavitha.. Judicial custody till 23rd of this month
BREAKING NEWS: Another shock for Kavitha.. Judicial custody till 23rd of this month

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న కవితకు, ఇవాళ్టితో గడువు ముగియడంతో అధికారులు కోర్టులో హాజరు పరిచారు.

ఈ సందర్భంగా ఈ కేసును మరింత విచారించాల్సి ఉందని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కవితకు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరారు. అయితే న్యాయస్థానం 9 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో కవిత మరోసారి తిహాడ్ జైలుకు వెళ్లనున్నారు.

మరోవైపు కవితను కలిసేందుకు ఆదివారం రోజున ఆమె సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన భర్త అనిల్ దిల్లీ వెళ్లారు. ఆదివారం సాయంత్రం సమయంలో కవితను కలిసి ఆ ఇద్దరూ మాట్లాడారు.