BREAKING NEWS: హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

BREAKING NEWS: CM Revanth Reddy reached Hyderabad
BREAKING NEWS: CM Revanth Reddy reached Hyderabad

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్‌ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్ శ్రేణులు.. స్వాగతం పలికాయి.

కాగా, సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న ఎల్బీ స్టేడియంలో భారీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి హాజరై 44 వేల మంది పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సభ అనంతరం సీఎం రేవంత్ జిల్లాల్లో పర్యటిస్తారని సమాచారం. మంత్రులు కూడా తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.