టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై చంద్రబాబు, ఉత్తమ్ ల భేటీ !

CBN To Meet Uttam kumar Reddy

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు విషయంలో శనివారం ఈరోజు ఉత్కంఠకు తెరవీడనుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి,చంద్రబాబు నాయుడుల భేటీలో పొత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పొత్తుల విషయమై తమ పార్టీ అధినేతతో చర్చించడానికే ఉత్తమ్‌ను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

utham kumar reddy & L ramana reddy

తెలంగాణలో తెలుగు తమ్ముళ్లను చంద్రబాబు ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా టీటీడీపీ నాయకుల భేటీలో పొత్తుల అంశం, ఉత్తమ్ ప్రతిపాదనపై చర్చించనున్నారు. తెలంగాణలో పొత్తుల విషయంపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే చంద్రబాబు టీ-కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌తో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.