సెన్సార్ పూర్తి చేసుకున్న “బ్రో”

Pawan Kalyan
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన మూవీ “బ్రో “. ‘వినోదయ సిత్తం’ ని తమిళంలో దర్శకత్వం వహించిన పి.సముద్రఖని.. తెలుగులోనూ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం జులై 28, 2023 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో ఘనంగా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్ చూసి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కి సంబందించిన ట్రైలర్ ను త్వరలో విడుదల చేయనున్నారు.  తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. కేతికా శర్మ , కేతికా శర్మవారియర్, లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, , సుబ్బరాజు, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.టీజీ విశ్వ ప్రసాద్ గారు , జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు . ఈ మూవీ కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీత స్వరాలూ అందించారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.