చైన్ స్నాచర్‌ పట్టుబడి బంగారు వస్తువులు స్వాధీనం

చైన్ స్నాచర్‌ పట్టుబడి బంగారు వస్తువులు స్వాధీనం
chain Snatcher

చందానగర్ పోలీసులు ఓ చైన్ స్నాచర్‌ను పట్టుకున్నారు. సంగారెడ్డిలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న రమేశ్ (21) అనే కార్మికుడు సెప్టెంబర్ 13న లింగంపల్లి రైతు బజార్‌లో మహిళ పట్లోతు లోకమ్మ నుంచి 30 గ్రాముల బంగారు గొలుసును అపహరించాడు.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం పటాన్‌చెరు సమీపంలో అతడిని పట్టుకున్నారు. విచారణలో లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో మరో నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి దొంగిలించిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.