చిత్తూరు ఎమ్మెల్సీ టికెట్ మీద బాబు కీలక నిర్ణయం

chandrababu key decision on Chittoor MLC Ticket

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు మ‌ర‌ణంతో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి ముద్దుకృష్ణ‌మ స‌తీమ‌ణి స‌ర‌స్వ‌త‌మ్మ కు టికెట్ ఖ‌రారుచేశారు. ఎమ్మెల్సీ టికెట్ ను స‌ర‌స్వ‌తమ్మకు కేటాయించిన‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. స‌ర‌స్వ‌త‌మ్మ‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఈ ఉద‌యం ముఖ్య‌మంత్రిని క‌లుసుకోగా…టికెట్ విష‌యం ఆయ‌న వారికి వెల్ల‌డించారు. నిజానికి ఈ టికెట్ కోసం ముద్దుకృష్ణ‌మ కుమారులిద్ద‌రూ పోటీప‌డ్డారు. దీంతో చంద్ర‌బాబు మ‌ధ్యేమార్గంగా స‌ర‌స్వ‌త‌మ్మ‌కు కేటాయించారు. ఎమ్మెల్సీగా ఉన్న గాలిముద్దుకృష్ణ‌మ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో క‌న్నుమూశారు. దీంతో ఆయ‌న రాజ‌కీయ‌వార‌స‌త్వం కోసం కుమారులిద్ద‌రూ రంగంలోకి దిగారు. ఇద్ద‌రిలో ఎవ‌రికిచ్చినా…రెండో వారు అసంతృప్తికి గురయ్యే ప‌రిస్థితి ఉండ‌డంతో చంద్ర‌బాబు గాలి భార్య‌కు టికెట్ కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యంపై గాలి కుటుంబంలో కూడా ఏకాభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంద‌ని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్య‌క్తంచేస్తున్నాయి.