సూపర్ స్టార్, కేటీఆర్ లకు చిరంజీవి సవాల్…!

Chiranjeevi Goodbye To Politics

లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు అంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమయాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో న‌డుస్తున్న ‘బీ ది రియ‌ల్ మెన్’ ఛాలెంజ్‌ని ఎన్టీఆర్‌.. మెగాస్టార్ చిరంజీవికి విసిరిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే.. ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మెగాస్టార్ త‌న వీడియోని షేర్ చేశాడు. ‘ఇది నీ కోసం భీం.. నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం’ అంటూ తాను ఇంట్లో చేస్తున్న ప‌నుల‌కి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఇంట్లో ఫ్లోర్‌ని క్లీన్ చేయ‌డంతో పాటు దోసె వేయ‌డం వంటివి ఉన్నాయి.

అలాగే.. తన త‌ల్లి కోసం చిరు స్పెష‌ల్ దోసె వేశారు. ఎంతో ప్రేమ‌గా త‌న త‌ల్లి తినిపిస్తుంటే.. చిరు దానిని ఆస్వాదిస్తూ క‌నిపించారు. ఇక ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ లోని మ‌గువా మ‌గువా.. అనే పాట ఉంచ‌డం విశేషం. స‌క్సెస్‌ఫుల్‌గా త‌న ఛాలెంజ్‌ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌ని స్వీక‌రించమ‌ని సవాల్ విసిరారు.