పవన్ ని చాలెంజ్ చేసిన చిరంజీవి !

chiranjeevi challenge to pawan kalyan

పవన్ కల్యాణ్‌కు ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ విసిరారు. అదేంటీ తమ్ముడి మీద ఆయన చాలెంజ్ విసరడం ఏంటి ఇద్దరికీ చెరో పార్టీ ఉంది కాబట్టి రాజకీయంకి సంబందించింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అది ఇటీవలి కాలంలో హరితహారంలో భాగంగా కేటీఅర్ విసిరిన చాలెంజ్, అది ముగ్గురికి ఆ ముగ్గురు మరో ముగ్గురికి అంటూ చివరికి చిరంజీవి దగ్గరకి వచ్చింది. ఎన్టీవీ చౌదరి చేసిన చాలెంజ్ స్వీకరించిన చిరంజీవి తన ఇంటి ప్రాంగణంలో ఆయనే స్వయంగా మట్టిని తవ్వి, మూడు మొక్కలను నాటి, నీరు పోశారు.

అనంతరం ఆయన మరో ముగ్గురు ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను ఆయన ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. మరోవైపు, ఈ గ్రీన్ ఛాలెంజ్ కు భారీ ఎత్తున స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, కేటీఆర్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసి పలువురిని నామినేట్ చేశారు.