వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని కమేడియన్, పృధ్వీరాజ్ జోస్యం చెప్పాడు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఢిల్లీలో ఆప్ సాధించినంతటి ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతం చేసుకోనుందని కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చని వ్యాఖ్యానించాడు. తన అనుచరులు, ఇతర నేతలు చెప్పే మాటలు, సలహా, సూచనలను వైఎస్ జగన్ పట్టించుకోరని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నాడు. జగన్ ను దగ్గర నుంచి చూసిన తనకు ఆయన మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసునని గతంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ పాప్యులారిటీని చూసి, మొత్తం ప్రభుత్వం రంగంలోకి దిగి విజయం కోసం శ్రమించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. అలాగే జగన్ సాగిస్తున్న ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్లు ఇద్దరు పాల్గొన్నారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని పృథ్వీ చెప్పుకొచ్చాడు.