మెగా ఫ్యాన్స్‌కు మళ్లీ బ్యాడ్‌ న్యూస్‌

Chiranjeevi starrer ‘Sye Raa Narasimha Reddy’ second schedule postponed
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రెండవ షెడ్యూల్‌ గత కొన్ని నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. మొదటి షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెల్సిందే. రెండవ షెడ్యూల్‌లో అమితాబచ్చన్‌తో పాటు ఇంకా పలువురు స్టార్స్‌ నటించబోతున్నారు. ఫిబ్రవరిలో రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మార్చిలో రెండవ షెడ్యూల్‌ను మొదలు పెట్టనున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా మళ్లీ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల చిత్రీకరణను వచ్చే నెలలో చేయబోతున్నట్లుగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి ప్రకటించాడు. సినిమాను మొదట అనుకున్న దానికంటే ఎక్కువ రిచ్‌గా తీయడంతో పాటు, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఆలస్యం చేస్తున్నామని, ఆలస్యం అయినా కూడా మంచి ఔట్‌ పుట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు చెబుతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను రామ్‌ చరణ్‌ నిర్మిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా నటించబోతుంది. సునీల్‌ కమెడియన్‌గా నటించబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిరు 151వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.