మంత్రి విడదల రజిని చేత రాఖీ కట్టించుకున్నసీఎం జగన్..!

YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

రక్షాబంధన్ ను పురస్కరించుకొని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి విడదల రజిని రాఖీ కట్టారు. కాకినాడ పర్యటనకు వెళ్లిన జగన్ కి హేలిప్యాడ్ వద్ద ఆమె రాఖీ కట్టి, స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక రజనీకి తన ఆశీర్వాదాలు ఉంటాయని సీఎం జగన్ తెలిపారు.

అనంతరం వైసిపి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో జగన్ పాల్గొని నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఓ అన్నగా, తమ్ముడిగా ఎప్పుడు మీకు అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, రక్షనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు…