అలీకి సానుభూతి తెలిపిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

అలీకి సానుభూతి తెలిపిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

నేడు ఉదయం (గురువారం నాడు) ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీ తల్లి జైతున్ బీబీ రాజమండ్రి లో తుది శ్వాస విడిచారు. ఆ తరువాత ఆమెని హైదరాబాద్ లోని అలీ ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు అందరు కూడా అలీ ఇంటికి వెళ్లి సంతాపం తెలుపుతున్నారు. కాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అలీకి సానుభూతి తెలిపారు. కాగా అలీ తల్లి మరణ వార్త తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

కాగా “నటుడు అలీ మాతృమూర్తి జైతున్ బీబీ తుదిశ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”… అని పవన్ కళ్యాణ్ ప్రకటన ద్వారా అధికారికంగా పేర్కొన్నారు. కాగా కొద్దీ సేపటి క్రితం ప్రముఖ నటుడు చిరంజీవి స్వయంగా అలీ నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తన కుటుంబాన్ని పరామర్శించారు. మిగిలిన సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా అలీ ఇంటికి చేరుకుంటున్నారు.