కాంగ్రెస్ సీనియర్ నేతకి కరోనా

కాంగ్రెస్ సీనియర్ నేతకి కరోనా

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ, తనతో సన్నిహితంగా మెలిగినవారిని అప్రమత్తం చేశారు.

కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని ట్వీట్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరనా మహమ్మారి కేసుల నమోదు కాస్త తగ్గినప్పటికీ ఉధృతి కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్యం 73 లక్షలను దాటేసిన సంగతి తెలిసిందే.