ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు స్వల్పంగా పెంచగా కేసుల్లో కూడా అంతే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అలాగే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం 2 నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 29,309 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 104 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,88,004కి చేరింది. ఇక, రాష్ట్రంలో ఆదివారం కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం ఇద్దరు మరణించారు. కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,156కు పెరిగింది. అయితే రాష్ట్రంలో డిశ్చార్జిలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి బారి నుంచి సోమవారం మొత్తం 147 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,79,651 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,197కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,89,103 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇక, మంగళవారం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 27 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో కేసులు సున్నాకు పడిపోయాయి. అలాగే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 12 ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు స్వల్పంగా పెంచగా కేసుల్లో కూడా అంతే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అలాగే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం 2 నమోదయ్యాయి.

ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 29,309 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 104 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,88,004కి చేరింది.

ఇక, రాష్ట్రంలో ఆదివారం కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం ఇద్దరు మరణించారు. కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,156కు పెరిగింది.

అయితే రాష్ట్రంలో డిశ్చార్జిలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి బారి నుంచి సోమవారం మొత్తం 147 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,79,651 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,197కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,89,103 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, మంగళవారం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 27 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో కేసులు సున్నాకు పడిపోయాయి. అలాగే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 12 ఉన్నాయి.