తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో మొత్తం 1531 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,187 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,456గా ఉన్నాయి. మరో 15,425 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1048 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గురువారం మరో ఆరుగురు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1330కి చేరింది.

గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 293 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది.మరోవైపు, తెలంగాణలో గురువారం ఒక్కరోజే 43,790 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 1531 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 42 లక్షలు దాటింది.